Saturday, September 10, 2011

యువ కిరణాలు కార్యక్రమానికి మన్మోహన్‌సింగ్‌

రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీఎం కిరణ్ ఆహ్వానించారు. డిసెంబర్ నెలాఖరుకు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఒకేరోజు లక్ష మందికీ నియామక ఉత్తర్వులు ఇస్తామని.. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరానని ఆయన చెప్పారు.

యువ కిరణాల కార్యక్రమానికి ముసలివాణ్ణి నేనెందుకులే కిరణ్ ! 45ఏళ్ళ యువకిరణం రాహుల్ గాంధీ ఉన్నాడు చూడు ఆయన్ను ఆహ్వానించు.ఎలాగూ నేను డమ్మీ క్యాండిడేటునేకదా!

Sunday, August 21, 2011

మేధావులు, తటస్థులూ పార్టీలోకి రండి--పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆహ్వానం

మేధావులు, తటస్థులూ పార్టీలోకి రండి--పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆహ్వానం

వచ్చాడుగా చిరంజీవి,అంటే ఆయన మేధావికాదు బకరా అనా మీ ఉద్దేశ్యం.

Saturday, August 20, 2011

బ్రదర్ అనిల్ కుమారూ ! వర్షాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నీవు జగన్ పైనా నీ పైనా జరిగే సిబిఐ దాడులను ఆపలేవా ?



బ్రదర్ అనిల్ కుమారూ ! వర్షాన్ని ఆపగలిగే శక్తి ఉన్న నీవు జగన్ పైనా నీ పైనా జరిగే సిబిఐ దాడులను ఆపలేవా ?
అలాగే ఏసుప్రభువు నీ కిచ్చిన authority తో వరదలొచ్చి మా పంటలను నాశనం చేస్తున్నప్పుడు ఆ వర్షాన్ని ఆపి పుణ్యం కట్టుకో బాబూ ! మా రైతులమంతా మీకు ఋ పడి ఉంటాం .

Sunday, April 10, 2011

ఖనిజమంతా గాలికి కొట్టుకొని పోయిన తర్వాత ఖనిజం లీజులిక ఖఠినమట

ఖనిజం లీజులిక ఠినం
ప్రైవేటు సంస్థల ఇష్టా రాజ్యానికి చెల్లు
మార్కెట్టును బట్టి ధరల పెంపు -- ఈనాడు

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel4.htm

ఖనిజమంతా గాలికి కొట్టుకొని పోయిన తర్వాత ఖనిజం లీజులిక ఠినమట

Saturday, April 9, 2011

అన్నా హజారేను ప్రభావితం చేసిన వివేకానందుని రచన

అన్నా హజారే "తన జీవితానికి సార్ధకతను కలిగించే లక్ష్యాలను " నిర్దేశించుకున్నాడు.న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో ఒక పుస్తకం కొన్నాడు అతను. వివేకానందుని రచన "జాతి నిర్మాణ గమ్య సాధనకై యువతకు పిలుపు" అనే ఆ పుస్తకం అతనిని చాలా ప్రభావితం చేసినది. రాజస్థాన్ లోని రాలె గావ్ అతడి స్వంత ఊరు. స్వగ్రామమైన రాలె గావ్ ను అభివృద్ధి పరచుటతో సామాజిక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.ఒకప్పుడు కరువు కాటకాలతో విల విలలాడిన రాలేగావ్ , సుక్షేత్రంగా మారింది.

మరి విద్యార్థుల పాఠ్యాంశంగా వివేకానందుని రచనలు చేర్చాలని ఆలోచిస్తుంటే మన మేతావులు కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?