Tuesday, March 29, 2011

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel3.htm

మా ఇంటికి రండి!
పాక్‌ అభిమానులకు పంజాబీల స్వాగతం
మొహాలీ, చండీగఢ్‌లలో స్వచ్ఛందంగా వసతి
క్రికెట్‌ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ పుణ్యమా అని భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పునఃప్రారంభమైన దౌత్యం ఎంతమేర ముందుకెళ్తుందో తెలియదుగానీ.. మొహాలీ, చండీగఢ్‌ వాసులు మాత్రం శాంతిబాటలో ముందడుగు వేశారు. ఇరు దేశాల ప్రభుత్వాలకు మార్గదర్శనం చేస్తున్నారు! బుధవారం మొహాలీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే చరిత్రాత్మక మ్యాచ్‌ చూసేందుకు సరిహద్దు దాటి వస్తున్న పాక్‌ అభిమానులకు చండీగఢ్‌, పంచకుల, మొహాలీ నగరాల ప్రజలు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 'మా ఇంటికి రండి..' అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. భారత్‌-పాక్‌ సెమీఫైనల్‌పై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో, చండీగఢ్‌తోపాటు చుట్టుపక్కల దాదాపు 40 కిలోమీటర్ల పరిధిలో హోటళ్లన్నీ నిండిపోయాయి. మామూలుగా రోజుకు వెయ్యి రూపాయలు ఉండే హోటళ్ల అద్దెలు ఐదు వేల రూపాయల దాకా పలుకుతున్నాయ్‌! ఇప్పుడవి కూడా దొరకని పరిస్థితి! మరోవైపు పాక్‌ నుంచి వస్తున్న అభిమానులందరికీ వీసాల జారీ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. సుమారు వెయ్యి నుంచి ఐదు వేల దాకా వీసాలిస్తారని సమాచారం. చివరి నిమిషంలో వారంతా ఇక్కడికి చేరుకుంటుండటంతో వసతి దొరకడం కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ప్రజలే తమ ఇళ్లలో వారికి ఆతిథ్యమివ్వటానికి సిద్ధపడ్డారు. మొదట పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇళ్లలో ఒక్కొక్కరికి వసతి కల్పిస్తామని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మిగతా ప్రజలూ ఇందుకు ఆసక్తి చూపడంతో పంజాబ్‌ ప్రభుత్వం మొహాలీ పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆతిథ్యమివ్వదలచుకున్న వారు తమ ఇంటి చిరునామాను ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు.

మీరు వారికి పోటీబడి ఆతిథ్య మివ్వడం బాగుందిగానీ వచ్చేవారు తిన్న ఇంటి వాసాల్లెక్కపెట్టేవాళ్ళు జర బద్రం .

వింటున్నారా మనమోహనసింగు గారూ !

Saturday, March 12, 2011

అసెంబ్లీ మరణించింది ,17న మాసికం పెడతాం -కోదండరాం

అసెంబ్లీ మరణించింది ,17న మాసికం పెడతాం -కోదండరాం

https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/mar/13/main/13main12&more=2011/mar/13/main/main&date=3/13/౨౦౧౧


ముందు నీకూ, కెసియార్ కు పెడితే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుంది